హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని, ఉపాధ్యాయుల కొరత లేకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. పీఆర్టీయూ టీఎస్ 2024 నూతన డైరీని సీఎం రేవంత్రెడ్డి శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి ఆవిష్కరించారు.
డిసెంబర్ నెల వేతనాలను ఇచ్చిన మాట ప్రకారం 5వ తేదీలోగా చెల్లించినందుకు ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికే ఉపాధ్యాయ పదోన్నతులతో పాటు అన్ని సమస్యలు, పరిష్కరించాలని ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి సీఎంను కోరారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు, పంచాయితీరాజ్ ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.