హైదరాబాద్ :టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని అధికారులనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై(Municipal administration )అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్టును15రోజుల్లోగా అందించాలన్నారు.
తప్పుడు రిపోర్టులు ఇస్తే అధికారులపైనా చర్యలు తప్పవన్న హెచ్చరించారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయ డంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్స్గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. హోమ్ గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరిం చాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.