కీసర, ఆగస్టు 11 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన సోమని లక్ష్మమ్మకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.35వేల చెక్కును లబ్ధిదారురాలికి మంత్రి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు వంగేటి పర్వత్రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు
కొర్రెముల గ్రామానికి చెందిన ఒకరికి..
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 11: మండల పరిధిలోని కొర్రెముల పంచాయతీ కార్యాలయంలో అదే గ్రామానికి చెందిన టి.శ్రీనివాస్కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.35,500 చెక్కును సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ అందజేశారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, సభ్యులు ఆంజనేయులు, బాబు, భాస్కర్, భార్గవి, నాయకులు నాగార్జున, సత్యనారాయణ, నాగేశ్ గౌడ్ పాల్గొన్నారు.
అలియాబాద్కు చెందిన ఒకరికి..
శామీర్పేట, ఆగస్టు 11 : శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన పీ.సందీప్ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి లబ్ధిదారుడికి గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వై.ఎల్లయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.