బండ్లగూలో రూ.485 కోట్లతో పలు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
బండ్లగూడ,ఏప్రిల్ 20: రాష్ట్ర అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.బుధవారం ఆయన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ.485కోట్లతో పలు అభివృద్ధి పనులకు మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు,కార్పొరేషన్,రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జోరందుకున్నాయన్నారు. కార్పొరేషన్ పరిధిలోని బస్తీల్లో రోడ్లు,అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, డీఈ యాదయ్య,కార్పొరేటర్లు రాము,అస్లాంబిన్ అబ్దుల్లా, పద్మావతి పాండు,చ్రంశేఖర్,సాగర్గౌడ్,నార్సింగి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ లక్ష్మి,బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్,నాయకులు నాగారాజు,ఆరో వార్డు టీఆర్ఎస్ ఇన్చార్జి సుమన్గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మణికొండ, ఏప్రిల్ 20: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మణికొండ గ్రామానికి చెందిన పీసరి ప్రేమలత అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.60వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కు బుధవారం స్థానిక నేతల సమక్షం లో ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు, నాయకులు సందీప్, కుమార్, శ్రీకాంత్, శ్రావణ్ పాల్గొన్నారు.
దళితరత్న అవార్డు గ్రహీతకు ఎమ్మెల్యే సన్మానం
మణికొండ గ్రామానికి చెందిన ఏర్పుల కుమార్కు యువ దళితరత్న అవార్డు దక్కింది. ఈక్రమంలో మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను కలిశారు. ఈ సందర్భంగా కుమార్ను ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు.కార్యక్రమంలో మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీరాములు, మాజీ సర్పంచ్ నరేశ్, నాయకులు సందీప్, శ్రావణ్, శ్రీకాంత్, గంగాధర్, వంశీ పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలి
బండ్లగూడ,ఏప్రిల్ 20: హిమాయత్సాగర్ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామాస్తులు మాట్లాడుతూ జంట జలాశయాలు పక్కనే ఉన్న తమకు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు.అంతే కాకుండా గ్రామాభివృద్ధికి నిధులు మంజురూ చేయాలని కోరారు.స్పందించిన ఎమ్మెల్యే తాగునీటి సమస్యను వెం టనే పరిష్కరించి గ్రామంలో సమస్యలను గుర్తించి తగిన నిధుల మంజురుకు చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాము,మాజీ సర్పంచ్ ఆంజనేయులు పాల్గొన్నారు.