Gellu Srinivas Yadav | నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఆగ్రహానికి ప్రతీక అని BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును అణచివేయాలని చేసిన ప్రయత్నానికి ఈ పరిణామం మంచి సమాధానమన్నారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
గత కొద్ది రోజులుగా విద్యార్థులు చేస్తున్నపోరాటానికి ఫలించిన కృషి అని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో CJP పార్టీ, తెలంగాణలో BRSV ఆందోళనతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులు చేసిన పోరాటానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. విద్యార్థుల నిరసనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం చివరకు ప్రభుత్వానికే నష్టాన్ని మిగిల్చిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే దేశ యువత తగిన సమాధానం చెబుతుందని.. ఈ ఉద్యమ పోరాటం ఒక సందేశం ఇచ్చింది అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.