న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం రూపొందించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవ్జోత్ సింగ్ సిద్ధు తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా పటియాలాలోని తన ఇంటిపై జెండా ఎగిరేశారు. ప్రతి ఒక్క పంజాబీ రైతులకు తప్పనిసరిగా మద్దతు తెలపాలని, ప్రభుత్వానికి నిరసనగా తమ ఇంటిపై నల్ల జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి రేపటితో ఆరు నెలలు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో మే 26న తమ ఇంటిపై జెండా ఎగరేయాలని శిరోమణి అకాలీదల్ పార్టీ అధినేత సుక్బీర్ సింగ్ బాదల్ పిలుపునిచ్చారు. తద్వారా రైతులకు తమ మద్దతు తెలపాలని సూచించారు. అదేవిధంగా రైతుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రధాని మోదీని కోరారు.