Telangana Assembly Elections | మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. 9 రౌండ్లు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ పార్టీకి 13806 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మల్లారెడ్డికి 80,456, కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్కు 66650, బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డికి 17157 ఓట్లు పోలయ్యాయి. మల్లారెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో గులాబీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. సంబురాలు చేసుకుంటున్నారు.