మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి
ఘట్కేసర్ రూరల్, మార్చి 26: తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్షతపై ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ జంగమ్మ, ఎంపీడీవో అరుణ, మండల రైతు బంధు అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి తదిరులు పాల్గొన్నారు.