చర్లపల్లి, ఏప్రిల్ 3 : అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, శ్రీనివాసులు పేర్కొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలు పు మేరకు ఆదివారం ఈసీఐఎల్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో పెరుగుతున్న ధరలకు నిరసనగా ర్యాలీ నిర్వహించి.. ఆందోళన చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో అమలు కాని హామీలు గుప్పించి అధికారలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడటం సరికాదన్నారు.
పెరుగుతున్న ధరల తో సామన్య, పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి నిత్యావసర ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వారు హెచ్చరించారు. కార్య క్రమంలో నాయకులు సఫియా సుల్తానా, శ్రీమన్నారాయణ, నర్సింహ, శ్రీనివాస్రావు, అప్పారావు, నయింపాషా, యాదగిరి, శివన్నారాయణ, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.