బంజారాహిల్స్,ఆగస్టు 30 : స్పా ముసుగులో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాంతపూర్లోని బాపూనగర్కు చెందిన ఏ.వేణుగోపాల్(36) అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీఎస్.బ్యూటీ స్టూడియో పేరుతో కొనసాగుతున్న స్టూడియోలో స్పా ఏర్పాటు చేశాడు.
అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి సెక్స్వర్కర్లను తీసుకువచ్చి వారిచేత వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. అక్కడున్న నలుగురు సెక్స్వర్కర్లను రెస్క్యూ చేసిన పోలీసులు విచారణ చేపట్టగా వేణుగోపాల్ అనే వ్యక్తి తమను ఇక్కడకు పిలిపించారని తెలిపారు.
వారానికి రూ.15వేల చొప్పున చెల్లించి తమతో వ్యభిచారం చేయిస్తున్నారని వెల్లడించారు.
ఈ మేరకు నిర్వాహుడు వేణుగోపాల్తో పాటు అతడికి సహకరిస్తున్న మేనేజర్ రాకేష్, కస్టమర్ సురేంద్రరాజును అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. సెక్స్వర్కర్లను రెస్క్యూ హోమ్కు తరలించారు.