KTR | హైదరాబాద్ : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితను ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. నిన్న నల్లగొండ సభ అనంతరం తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు వస్తుండగా, నార్కట్పల్లి వద్ద ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. లాస్య నందితకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కేటీఆర్ బుధవారం నందిత నివాసానికి వెళ్లి పరామర్శించారు.