కీసర/ఘట్కేసర్/మేడ్చల్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించడం పక్కా అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కీసర మండలం చీర్యాల్, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడు తూ తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని, మరోమారు ప్రజలను ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని అన్నారు.
కాంగ్రెస్,బీజీపీ పార్టీల నేతల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని విమర్శించారు.రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుపారని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధే అభ్యర్థు ల గెలుపునకు విజయసోపానాలు అని అన్నారు. నియోజ కవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశానని, గతంలో ఈ ప్రాంతం గురించి పట్టించుకున్న నాథుడే లేడన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెలో అభివృద్ధి జరిగిందన్నారు.పథకాలు, అభివృ ద్ధిని బూత్ కమిటీ సభ్యులు, నాయకులు ఇంటింటికీ తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాల్సిన బాధ్యత బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులపైఏ ఉందన్నారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ సహకారంతో పరిశ్రమల ఏర్పాటు, విద్యా అవకాశాలు మెరుగు, మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు,మండల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన వంటివి చేశామ న్నారు. దీంతో నియోజకవర్గం ప్రజలు మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్,బీజేపీ నాయకులు నియోజకవర్గంలో ఎన్ని జమ్మిక్కులు చేసినా ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేసి మెజార్టీ చూపిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దయాకర్ రెడ్డి,పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కొండల్రెడ్డి,ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలేశ్,ప్రధాన కార్యదర్శి ఎన్.శేఖర్ ముదిరాజ్,కౌన్సిలర్లు,మున్సిపాలిటీ వార్డుల బూత్ కమిటీల అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.
కీసర: మండలంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి మల్లారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నారాయణ, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.