నేరేడ్మెట్, మార్చి 19 : బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. మంగళవారం నేరేడ్మెట్ డివిజన్ జీకే పంక్షన్హాల్లో మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత, ఐటీ అభివృద్ధికి కారణం కేసీఆర్ అని అన్నారు. పోటీ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు ధన్యవాదాలు తెలిపారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, మీనా, మేకల సునీతా రాముయాదవ్, సబిత అనిల్కిశోర్, మాజీ కార్పొరేటర్లు జగదీశ్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల అంజయ్య, బద్దం పరశురాంరెడ్డి, జీకే హన్మంతరావు, శ్రీనివాస్ రెడ్డి, రాజు, ఉపేందర్రెడ్డి, రంపె చంద్రమౌలి, ఇప్ప శ్రీనివాస్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.