మల్కాజిగిరి, ఏప్రిల్ 9: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్లో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుపడచడంలో విఫలమై ందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ఆరోపణలను చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి తప్పుచేశామని ప్రజలు అంటున్నారని చెప్పారు. మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ సబితాకిశోర్, అనిల్కిశోర్, ప్రభాకర్, శివ, రాజు, బచ్చల స్వామి, చంద్రశేఖర్, సురేశ్, బాబు పాల్గొన్నారు.