గోల్నాక, ఏప్రిల్ 21: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి ఆదివారం బాగ్ అంబర్పేట డివిజన్లో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది.
అడుగడుగునా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి..దీవెనలు అందించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ..తనను గెలిపిస్తే ఢిల్లీలో తెలంగాణ గళం వినిపిస్తానన్నారు.