Dasoju sravan kumar | తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, పార్టీకి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పుడు చాలా మందికి కొంత అపనమ్మకమో ,ఆలోచనో ఉండొచ్చు. లేకపోతే కొంతమంది పేర్లు వచ్చినయ్.. కొంతమందివి రాలేదని ఉండొచ్చు. మనం 6 డివిజన్ మీటింగ్స్ పెట్టుకున్నం.. డివిజన్ డివిజన్ మీటింగ్లో అందరికీ క్లియర్ ఒకటే మాట చెప్పినమన్నారు. కేవలం బీఎల్ ఎస్ అంటే ఎస్ ఐఆర్ కార్యక్రమానికి ఒక్కరినే ఇవ్వమని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.
మెంబర్షిప్ అప్లికేషన్లో కేవలం ఇద్దరినే ఇవ్వమన్నది కాబట్టి మాత్రమే ఏరి కోరి కొంత ఉత్సాహంగా పనిచేసేటోళ్లు, యువకులను గుర్తించారు. అంతమాత్రం చేత గుర్తింపబడని, లిస్టులో లేనటువంటి వాళ్లను విస్మరణకు గురిచేసినట్టు కాదు.. ఇది మరిచిపోండి. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లందరినీ కూడా జట్టు కట్టి ముందుకు తీసుకుపోయే బాధ్యత.. పార్టీ ఎవరినీ వదిలిపెట్టదు. దయచేసి ఏ రకమైన అభద్రతా భావానికి, సందేహానికి కానీ లోను కావొద్దని కోరుతున్నానన్నారు.
ఇవాళ బీఆర్ ఎస్ పార్టీకి ఒక పరీక్షా సమయం. దేశంలో కూడా చాలా రాజకీయ పార్టీలున్నయి. తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీలో తెలంగాణ సమర యోధులం మనమందరం. దేశమంతా గర్వపడేలా పంజాబ్ రాష్ట్రాన్నో లేదా ఇతర రాష్ట్రాలను తలదన్నే రీతిలో మన నాయకుడి నేతృత్వంలో నంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దబడ్డ పార్టీలో మనమున్నామన్నారు. మనమంతా బీఆర్ ఎస్లో భాగమైనందుకు గర్వపడాలి. మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు.