Lok Bhavan | అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్భవన్కు బయలుదేరారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ శాసనసభ్యులపై రేవంత్రెడ్డి సాయుధ దళాలు సామూహికంగా భౌతిక దాడికి దిగాయి.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చీర పట్టుకొని విచక్షణారహితంగా లాగారు. బూటు కాళ్లతో తొక్కుతూ నెట్టివేయడం. మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని మగ పోలీసులు జుటు పపట్టుకొని గుంజేయడం, ఆమె గొంతు పిసికే ప్రయత్నం చేయడం, కేటీఆర్ మీద పడి రక్కిన తీరు, హరీశ్రావును రోడ్డు మీద పడేసి తొక్కి రాక్షసంగా ప్రవర్తించారు. న్యాయం చేయాలని అసెంబ్లీలో ప్రశ్నిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో గవర్నర్ను కలువాలని నిర్ణయించారు.
లోక్ భవన్కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిపై గవర్నర్కు ఫిర్యాదు https://t.co/d6KVM1mlvH pic.twitter.com/7lLHE6T4Od
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2026