సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ) : అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులు, ముఖ్యనేతలు, గులాబీ శ్రేణులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెలువెత్తాయి.
ఉదయం నుంచి ఎమ్మెల్యేల నివాసాలు, పార్టీ క్యాంపు కార్యాలయాలలో సందడి వాతావరణం నెలకొన్నది. ఎమ్మెల్యేలకు శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రేణులు స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు.