మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 25 : తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలని, అభివృద్ధికే ప్రజలంతా పట్టం కట్టాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి, రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శనివారం మంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ది కండ్ల ముందు కనిపిస్తుందన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 3వ సారి అధికారంలోకి రాగానే మరిన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీతా శ్రీకాంత్గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి, పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, కౌన్సిలర్లు, కోఅప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్కే సాధ్యం : మంత్రి
– పోచారంలో ఆత్మీయ సమ్మేళనాలు
ఘట్కేసర్ : సీఎం కేసీఆర్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా నిలుస్తారని, ప్రజ లంతా కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు. శనివారం పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్ఖాన్గూడ, యంనంపేట్, లక్ష్మినర్సింహకాలనీ, పోచారంల్లో నిర్వ హించిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఆశించిన విధంగా రాష్ట్రం అభివృద్ధి సాధించిందన్నారు.
సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే 30న కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డ్యానాయక్, కౌన్సిలర్లు బి.హరిప్రసాద్రావు, లక్ష్మి, ధనలక్ష్మి, మమత రాణి, రాజశేఖర్, బాల్రెడ్డి, సాయిరెడ్డి, వెంకటేశ్గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి,కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.