Telangana Assembly Elections | హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారు. నాలుగు రౌండ్లు ముగిసేసరికి పద్మారావుకు 12,058 ఓట్ల ఆధిక్యం వచ్చింది. నాలుగో రౌండ్లో బీఆర్ఎస్కు 5204, బీజేపీ 1457, కాంగ్రెస్ పార్టీకి 1778 ఓట్లు పోలయ్యాయి. ప్రతి రౌండ్కు బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం పెరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.