బాలానగర్, డిసెంబర్ 23 : కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ మల్లికార్జునకాలనీ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ నివాసం వద్ద నియోజకవర్గం కో ఆర్డినేటర్ రెడ్డి సతీశ్ అరోరా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఆయనతో పాటు కార్పొరేటర్ నర్సింహయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఊహించని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని సంతోషం వ్యక్తం చేశారు. 70 ఏండ్ల కాలంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలేక వెనుకబాటు తనానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు సుధీర్ఘ ఉద్యమం చేపట్టి రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు.
రాష్ర్టాన్ని సాధించిన విధంగానే అభివృద్ధిని సైతం అంతే వేగంతో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెడుడుతన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా కనిపించడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూచనల మేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రతి 100 మందికి ఒక ఇన్చార్జిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే దిశగా కార్యచరణ చేపట్టినట్లు తెలిపారు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గంలో సైతం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సయ్యద్ ఎజాజ్, బల్వంత్రెడ్డి, కర్రె జంగయ్య, మక్కల నర్సింగ్, ఇర్ఫాన్, హరినాథ్, బుర్రి యాదగిరి, రాజుగౌడ్, చారీ, రాజుగౌడ్, మట్టి శ్రీను పాల్గొన్నారు.
ఫతేనగర్లో..
ఫతేనగర్ ప్రధాన రహదారిలో ఉన్న పోచమ్మ ఆలయ 25 వార్షికోత్సవానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో నరేందర్గౌడ్, కంచి పాండు, కంచి మహేందర్, భిక్షపతి పాల్గొన్నారు.