మహేశ్వరం జోన్బృందం, నవంబర్ 3: సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని, రోజురోజుకూ బీఆర్ఎస్కు మద్దతు పెరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం పడమటి తండా, హర్షగూడ గ్రామానికి చెందిన 150 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్ష పార్టీలు అయోమయంలో పడ్డాయని.. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అభివృద్ధే ధ్యేయంగా నిత్యం శ్రమిస్తున్నానని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పడమటి తండా సర్పంచ్ అనితా రవినాయక్, హర్షగూడ ఎంపీటీసీ విజయ్కుమార్, ఉపసర్పంచ్ రవినాయక్, నాయకులు లింగయ్య నాయక్, రాములు నాయక్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి
తొమ్యిదిన్నరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశంలో ఎక్కడాలేదని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, సర్పంచ్ శ్రీలత శ్రీహరి, మాజీ సర్పంచ్ జంగయ్య, మాజీ డైరెక్టర్ పారిజాతం, శ్రీహరి ముదిరాజ్, మహేందర్రెడ్డి, ఐనవోలు శ్రీకాంత్రెడ్డి, పాండు, సత్తయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి ఎడ్ల మల్లేశ్ ముదిరాజ్ తన అనుచరులతో కలిసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సబితాఇంద్రారెడ్డి గెలుపుతోనే యువతకు న్యాయం
మంత్రి సబితాఇంద్రారెడ్డి గెలుపుతోనే యువతకు న్యాయం జరుగుతుందని.. ఆర్కేపురం డివిజన్ కృష్ణానగర్కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి 100 మంది యువకులు శుక్రవారం పట్లోళ్ల కల్యాణ్రెడ్డి, బీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, షాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెంటూరి రవీందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, మారోజు రామాచారి, గొడుగు శ్రీనివాస్, కొండ్ర శ్రీనివాస్, సిద్దగోని వెంకటేశ్గౌడ్, పెంబర్తి శ్రీనివాస్, వల్లూరి రమేశ్, జగన్మోహన్రెడ్డి, ముచింతల జగన్, బాలుశ్రీ, జాహెద్ తదితరులు ఉన్నారు.
మంత్రిని భారీ మెజారిటీతో గెలిపించాలి
మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని జడ్పీచైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి కోరారు. శుక్రవారం డబిల్గూడ గ్రామంలో జరిగిన బూత్ కమిటీ సమావేశంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరి గౌడ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. మహేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మర్యాద రాఘవేందర్రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు ధార జంగయ్య, బీఆర్ఎస్ నాయకులు ఆంధ్యానాయక్, ఏకుల రాములు, బుగ్గని ఇస్తారి, రాకేశ్రెడ్డి, బొర్ర కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ఓటు వేయాలి
అభివృద్ధికి పట్టం కట్టాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ వట్నాల శోభాఈశ్వర్గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. శుక్రవారం మాన్యగూడ, ఆకులమైలారం, మురళీనగర్, బైరాగిగూడ, తిమ్మాపూరు, నేదునూరు తదితర గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి సబితా ఇంద్రారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు కాసుల రామకృష్ణారెడ్డి, గొరిగె కళమ్మ రాజు, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, వట్నాల ఈశ్వర్గౌడ్, ఎలుక మేఘనాథ్రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు సొలిపేట అమరేందర్రెడ్డి, ఎండీ దావుద్, ఎంపీటీసీ కాకి రాములు, మండల సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, నాయకులు ఎడ్ల రాంరెడ్డి, అంజయ్య, తిరుపతయ్య, మంద సాయిలు, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, బాబయ్య, మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, రూప్చందర్, కొండల్రెడ్డి, శకంర్, మనోహర్, శకంర్, జైపాల్, మాజీ ఎంపీటీసీ బాలయ్య, వెంకటయ్య, శ్రీధర్, చందర్, సంజీవరెడ్డి, కృష్ణ గౌడ్, వెంకటేశ్, నరేందర్, మైసయ్య, భగవంతు, జంగయ్య, మోహన్, నాగార్జున, సందీప్, ప్రవీణ్, అజయ్, సతీశ్ పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి గెలిపించాలి
అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్ కోరారు. శుక్రవారం నందుపల్లి, నాగారం, మహేశ్వరం, తుమ్ములూరు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపును కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోషియేషన్ చైర్మన్ కరుణాకర్రెడ్డి, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, పీఏసీఎస్ డైరెక్టర్ పొల్కం బాలయ్య, ఉపసర్పంచ్ కటికెల శ్రీహరి, నాయకులు బండారు లింగం, మంత్రి రాజేశ్, అంబయ్య యాదవ్, సుధాకర్రెడ్డి, దుడ్డు కృష్ణ యాదవ్, కటికెల శ్రీనివాస్, బి.జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
గెలుపు ఖాయం.. మెజార్టీ లక్ష్యం
ఎన్నికల్లో సబితాఇంద్రారెడ్డి గెలుపు ఖాయమైనా మెజార్టీపై దృష్టిపెట్టామని బీఆర్ఎస్ మహేశ్వరం ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, సరూర్నగర్ డివిజన్ అధ్యక్షుడు బోయిని మహేందర్యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి తెలిపారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డికి మద్దతుగా సరూర్నగర్ డివిజన్ భగత్సింగ్నగర్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు.
యువగర్జన సభను విజయవంతం చేయాలి
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 5న మీర్పేట్లో నిర్వహించే యువగర్జన సభను విజయవంతం చేయాలని నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, మండల అధ్యక్షుడు కొలను విఘ్నేశ్వర్రెడ్డి కోరారు.