బ్రాహ్మణ కుల ధర్మ పరిరక్షణకు, న్యాయపరమైన కోర్కెల సాధనకు, రాజకీయ పురోగమనానికి బ్రహ్మ గర్జన
బహిరంగ సభ బ్రాహ్మణ కులోత్తముల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ – సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మైదానంలో జరిగింది.
సభ ప్రారంభానికి ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళలతో శ్రీలలిత – విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు. బ్రహ్మ గర్జన చైర్మన్ వెన్నపంల్లి జగన్మోహన్శర్మ, వైస్ చైర్మన్ తులసి శ్రీనివాస్, కోశాధికారి మునిపల్లె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.
– ఆర్కేపురం, జూలై 9