హైదరాబాద్: నగరంలోని భోలక్పూర్లో (Bholakpur) విద్యుదాఘాతంలో బాలుడు మృతిచెందాడు. భోలకపుర్లోని దేవిచౌక్ వద్ద విద్యుత్ తీగలకు డీసీఎం తగలడంతో కంరెటు తీగ వైరు తెగిపోయింది. దీంతో అది డీసీఎం వెనకాల వస్తున్న మహమ్మద్ సమీర్ (14) బైక్పై పడింది. విద్యుత్ షాక్ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.