బేగంపేట్ జూలై 20: ఆషాఢ బోనాల జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15కోట్ల నిధులను మంజూరు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. ఈనెల 25,26వ తేదీల్లో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరతో పాటు రాంగోపాల్పేట్, మోండామార్కెట్, బేగంపేట్, బన్సీలాల్పేట డివిజన్లలోని ఆయా ఆలయాల్లో జరిగే బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసి నిధుల చెక్కులను మంగళవారం మహంకాళి అమ్మవారి మండపంలో ఆయా ఆలయాల నిర్వాహకులకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అందజేశారు. మహంకాళి ఆలయానికి ప్రత్యేకంగా రూ. 15లక్షల చెక్కును ఇప్పటికే అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, పలు ఆలయాల నిర్వాహకులు పాల్గొన్నారు.