మేడ్చల్ జోన్ బృందం, జూలై 16: పల్లె, పట్టణం బోనం ఎత్తింది. గ్రామ దేవతల ఆలయాలకు భక్తజనం పోటెత్తింది. ఆషాఢమాసం చివరి ఆదివారం రోజున బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, మూ డుచింతలపల్లి, కీసర, ఘట్కేసర్ మండలాలతో పాటు మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలోని ప్రజలు బోనాల పండుగను జరుపుకున్నారు. వివిధ వార్డులకు చెందిన మహిళలు డప్పు, చప్పుళ్లు, పోతురాజుల నృత్యా లు, డీజే సౌండ్ మధ్య బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి, గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గ మ్మ, మైసమ్మ తదితర గ్రామ దేవతలకు సమర్పించారు. ఉదయం నుంచి భక్తులకు ఆలయాలకు తరలివచ్చి, దర్శనం చేసుకున్నారు. ఒడిబియ్యం పోసి, దీపారాదన చేసిన మొక్క లు తీసుకున్నారు. నియోజకవర్గం లోని పలు అమ్మవారి ఆలయల్లో మంత్రిమల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా మంత్రిని నాయకులు సన్మానించా రు. మేడ్చల్ పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఏడుగుళ్లు, కిందిబస్తీలో ఉన్న పోచమ్మ, కుమ్మరి బస్తీలో ఉన్న దుర్గమ్మ, చంద్రానగర్లో ఉన్న నల్ల పోచమ్మ తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఘట్కేసర్ మండల పరిధి చౌదరిగూడ పంచాయతీ వెంకటాద్రి టౌన్షిప్, ఎన్ఎఫ్సీనగర్లో బోనాల పండుగ ఘనంగా జరిగింది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు అందరినీ అలరించాయి.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో ఆలయాల్లో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు రవీందర్ గౌడ్, స్వామి, బీసీ సెల్ అధ్యక్షుడు రాజేందర్ ముదిరాజ్, నాయకులు శ్రీనివాస్, శివ ముదిరాజ్, గోపాల కృష్ణ, రాజు, బాబు ముదిరాజ్, దీపక్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లో మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మేయర్ మేకల కావ్య బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. జవహర్నగర్ కురుమ సంఘం అధ్యక్షుడు మండల సురేందర్ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. మేడ్చల్ నియోజవకర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, జిల్లా నాయకుడు అయ్యప్ప పాల్గొన్నారు. పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో చైర్మన్ కొండల్ రెడ్డి, కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు. తొట్టెల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.కీసర మండలంలోని పలు గ్రామాల్లో బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి, అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలో బోనాలు పండుగా భక్తి శ్రద్ధ్దలతో నిర్వహించారు. తూంకుంట మున్సిపాలిటీ, మూడుచింతలపల్లి మండలం కొల్తూర్, కేశవరం, తదితర గ్రామాల్లో పోతరాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపులు నిర్వహించి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమం లో సర్పంచ్లు శిల్పాయాదగిరి, జ్యోతిబలరామ్గౌడ్, చైర్మ న్ రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.