బేగంపేట్, జనవరి 17: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు బారికేడ్లను ఢీకొట్టి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పాత బోయిన్పల్లి మల్లికార్జున నగర్ కాలనీలో నివాసముంటున్న రాజ్కుమార్ పాండే, మనోజ్కుమార్ పాండే (29) సోదరులు. వీరిద్దరు కలిసి ఆదివారం రాత్రి 10.30 గంటలకు బైక్పై వెళ్తూ.. బాలంరాయి సమీపంలోని స్కోడా షోరూం వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టారు. దీంతో కింద పడిన మనోజ్ కుమార్ పాండే తీవ్రంగా గాయపడ్డాడు.
వెనక కూర్చున్న రాజ్కుమార్కు స్పల్ప గాయాలయ్యాయి. మనోజ్కుమార్ పాండేను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.