సికింద్రాబాద్ : బోయిగూడలో అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గత నెల 23న వేకువ జామున భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టింబర్ డిపోలో ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా 11 మంది చెందగా.. తాజాగా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగ్ని ప్రమాదంలో బిహార్ చాప్ర జిల్లాలోని ప్రేమ్కుమార్ (20) గత కొంతకాలంగా శ్రావణ్ స్క్రబ్ ట్రేడర్స్ గోదాంలో కార్మికుడుగా పని చేస్తున్నాడు.
ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో 11 మంది ఉన్న విషయం తెలిసిందే.
ప్రమాదం బారి నుంచి తప్పించుకొని కిటికీలో నుంచి ప్రేమ్కుమార్ బయటకు దూకాడు. గత 24 నాలుగు రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ బంజారాహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ప్రేమ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు గాంధీనగర్ పోలీసులు తెలిపారు.