తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నందినగర్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు, శాసన సభ సభ్యులు కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పలువురు నేతలు సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహారించాలనే అంశాలపై పలువురికి దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన ఉండి పోరాడాలని సూచించారు.