ఎల్బీనగర్/వనస్థలిపురం, మార్చి 14 : సాగర్ రహదారి మధ్యలో చెట్లను ఆధునీకరించి సుందరీకరిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ రూపురేఖలు మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. అందులో భాగంగానే సాగర్ రహదారిని సుందరీకరిస్తున్నామన్నారు. డివైడర్ మధ్యలో మొక్కలు ఏర్పాటు చేసి వాటిని అందంగా మారుస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వాటిని రూపొందిస్తామన్నారు. రహదారిని చూడగానే ఆకర్షణీయంగా ఉండేలా చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, బీఆర్ఎస్ బీఎన్రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, హస్తినాపురం అధ్యక్షుడు అందోజు సత్యం చారి, శ్రీనివాస్ నాయక్, చంద్రశేఖర్రెడ్డి, పోగుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.