కాచిగూడ, డిసెంబర్ 16: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన బీసీల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డిని ఆర్.కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… కులాల వారీగా జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 40 శాతం వరకు , విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ కృష్ణ, రాజేందర్, అనంతయ్య, వెంకటేశ్, భూపేశ్సాగర్, సుధాకర్, రామకృష్ణ, పృథ్వీగౌడ్, నరసింహ గౌడ్, కృష్ణ యాదవ్, కృష్ణమూర్తి, శివకృష్ణ, శివ, మల్లేశ్ పాల్గొన్నారు.