కేపీహెచ్బీ కాలనీ, మే 13 : మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లో చోరీ జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ 4, 5వ రోడ్డులోని మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లోకి శుక్రవారం రాత్రి 2.45 సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు.
ఏటీఎం బాక్సులో భద్రపర్చిన రూ. 500 నోట్లు (5 లక్షలు) బయటికి తీసి పారిపోయాడు. ఏటీఎం సెంటర్ నుంచి అలారం మోగడంతో సిబ్బంది వెంటనే బ్యాంకు వద్దకు చేరుకోగా, అప్పటికే ఆ వ్యక్తి డబ్బులతో పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారమివ్వడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఫుటేజీని పరిశీలిస్తే దొంగతనం చేసిన వ్యక్తి ఏటీఎం బాక్సును తాళం చెవితో ఓపెన్ చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.