మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను కారు లారీ ఢీకొన్న ఘటన(Road acciden)లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లి(Kompalli)లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఎస్బీఐలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా(Bank employee) పని చేస్తున్న వెంకటేష్ విధుల్లో భాగంగా ఆఫీస్కు వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ అతడి బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవలే మృతుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు. వెంకటేష్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.