హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. బండ్లగూడ, పోచారంలోని 3716 రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు 39 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో బండ్లగూడలోని 2246 ఫ్లాట్లకు 33161 దరఖాస్తులు, పోచారంలోని 1470 ఫ్లాట్లకు 5921 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బండ్లగూడలోని త్రీ బీహెచ్కే-డీలో 345 ఫ్లాట్ల కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు.
లాటరీ ప్రక్రియను అధికారులు.. ఫేస్బుక్, యూట్యూబ్లలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. నేడు పోచారం, రేపు బండ్లగూడ, 29న బండ్లగూడ త్రీ బీహెచ్కే, డీలక్స్ డ్రా తీయనున్నారు. ఫ్లాట్ నంబర్, దరఖాస్తుదారుల పేర్లను వేర్వేరుగా ఎంచుకోవడం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు జరుగనుంది.