హైదరాబాద్: నగర శివార్లలోని రాజేంద్రనగర్లో దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం పాత కర్నూల్ రోడ్డులో ఓ ఆటో డ్రైవర్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తుపాకీ, కత్తులతో బెదిరించి ఆటో డ్రైవర్ మోసిన్ వద్ద వున్న రూ.3200 నగదు, సెల్ఫోన్ను ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదుతో మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను గుర్తించడానికి సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.