సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే 23 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని ఆటో జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా రవాణా శాఖ అడిషనల్ కమిషనర్ రమేశ్కు శుక్రవారం ఆటో జేఏసీ నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మారయ్య, సత్తిరెడ్డి, శివ, ప్రవీణ్, పెంటయ్య, యాదగిరి, షేక్ మాజిద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.