హైదరాబాద్ : మంచి చెప్పడమే ఆ యువకుడి పాలిట శాపమైంది. ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించ వద్దని చెప్పిన యువకులపై మందుబాబులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..కేకే గార్డెన్ ఖాళీ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అక్కడి కాలనీ యువకులు తాగొద్దని హెచ్చరించినందుకు యువకులపై దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం మందు బాబులు ఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.