దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరుల సంస్మరణ దినం గురువారం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో అమరవీరుల స్థూపాల వద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు శాలువా కప్పి అభివాదం చేశారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
అమర వీరుల ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.