కీసర: కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో నగరంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో కీసరగుట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో అభిషేకాలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు నేరుగా గుట్టలో కొలువైన కాశీవిశ్వేరాలయం, లక్ష్మీనర్సింహస్వామివారిని, శ్రీ నాగదేవతలను దర్శించుకున్నారు.