చిక్కడపల్లి : విద్యార్థి దశ నుంచి తెలంగాణ స్వరాష్ట్రం దిశగా జరిగిన ఉద్యమంలో టీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చురుకైన పాత్ర పోషించారని ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. అలాంటి ఉద్యమ నాయకున్ని టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్ధిగా ప్రకటించి ఉద్యమ నాయకుడికి సీఎం కేసీఆర్ సముచిత గౌరవం కల్పించారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ స్వరాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగులకు ఇచ్చే రాయితిని భారీ స్థాయిలో పెంచిన గౌరవం తెలంగాణ ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలతోపాటు అట్టడుగు వర్గాల పిల్లల బంగారు భవిష్యత్తు కోసం గురుకులాలు ఏర్పాటు, కల్యాణలక్ష్మి, మార్కేట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆయా సమయ సందర్భాల్లో ఉద్యమనాయకులను గుర్తించి సముచిత స్థానం కల్పించడంలో సీఎం కేసీఆర్ కు మరెవరు సాటి లేరని తెలిపారు.