మేడ్చల్, ఆగస్టు15(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాలోని 203 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అలాగే ప్రజాప్రతినిధులకు కూడా అవార్డులు ప్రదానం చేశారు.
మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్రావు చేతులమీదుగా అవార్డును అందుకుంటున్న మేయర్ వెంకట్రెడ్డి, కమిషనర్ రామకృష్ణారావు