హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్పోర్టు (Fake Passport) కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో పాస్పోర్టు తయారీ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని మక్లూర్, నవీపేట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్చార్జీగా ఉన్న ఏఎస్ఐ లక్ష్మణ్ను సీఐడీ(CID) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తదుపురి విచారణ కోసం లక్ష్మణ్ను హైదరాబాద్కు తరలించారు. ఇదే కేసులో భీంగల్ ఏజెంట్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.