శంషాబాద్: తరతరాలపాటు వెనకబడిన దళితుల కోసం సీఎం కేసీఆర్ చారిత్రాత్మక, సాహసోపేతమైన దళితబంధు పథకం అమలుకు శ్రీకారం చుట్టి నిజమైన దళితబాంధవుడైనాడని శంషాబాద్ మండల టీఆర్ఎస్ పార్టి అధ్యక్షుడు చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల ప్రజాప్రతినిధులు సంయుక్తంగా శంషాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ దళితులు రాబోయే రోజుల్లో ఆర్థిక సాధికారతతో పాటు సామాజిక, స్వయం సమృద్ది సాధించేందుకు దళితబంధు దోహదపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.