మారేడ్పల్లి, మార్చి18 : రైలు పట్టాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో(Train accident) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్- బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ల(Bollaram) మధ్యన సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి పట్టాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి వయసు సూమారు 30-35 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.