పనులకు శంకుస్థాపనచేసిన సందర్భంగా కేంద్ర మంత్రి
జి. కిషన్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్
అంబర్పేట, ఏప్రిల్ 30 : నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులను చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ చెంచు బస్తీలో గల కమ్యూనిటీహాల్పై రెండో అంతస్తు నిర్మాణానికి రూ.17 లక్షల ఎంపీ నిధులను మంజూరు చేశారు. ఈ పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ బి. పద్మవెంకటరెడ్డిలతో కలిసి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేసి చెంచు బస్తీ ప్రజలకు కమ్యూనిటీహాల్ను అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులకు చెప్పారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు పూర్తైన తరువాత బస్తీ ప్రజలు సరైన పద్ధతిలో వాడుకోవాలని సూచించారు.
నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను చేయడం జరిగిందని చెప్పారు. కార్పొరేటర్ బి. పద్మావెంకటరెడ్డి మాట్లాడుతూ కిషన్రెడ్డి పార్లమెంటు నిధులతో చాలా ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డా.ఎన్. గౌతంరావు, ప్రధాన కార్యదర్శి సి. కృష్ణాగౌడ్, ఇ. అజయ్కుమార్, డివిజన్ అధ్యక్షుడు చుక్క జగన్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు జె. బాల్రాజ్, రాజేశ్ పాల్గొన్నారు.