కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 5: ఎడతెరిపి లేకుండా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 12 శాతం, గాజులరామారం సర్కిల్ పరిధిలో 12.7 వర్షాపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం ఉదయం ప్రభుత్వం పాఠశాలలకు సెల వు ప్రకటించడంతో విద్యార్థులకు ఉపశమనం లభించింది. కాగా.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో పేట్ బషీరాబాద్, చింతల్, శ్రీనివాస్నగర్, వెంకన్నహిల్స్, అంగడిపేట విలేజ్తో పాటు గాజులరామారం సర్కిల్ పరిధిలో చింతల్, భగత్సింగ్న గర్, రంగారెడ్డినగర్, గాజులరామారం ప్రాంతాల్లోని ఆయా కాలనీల్లో వరదనీరు పోటెత్తింది. కాగా ..జంట సర్కిళ్లతో పాటు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వరదనీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు మాన్సూన్టీం, అధికారయంత్రాం గం పర్యటించి.. ప్రధాన కాలనీల్లో, రోడ్లపై వరదనీటిని తొలగించారు. వెంకన్నహిల్స్, బాపునగర్, వాజ్పేయ్నగర్, శ్రీనివాస్నగర్ ప్రాంతాల్లో లోతట్టుగా ఉండటంతో వరదనీరు పలు ఇండ్లలోకి చేరాయి. దీంతో ఇండ్లలో నిత్యావసర సరుకులు, వస్తువులు తడిసిముద్దయ్యాయి.
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, మేయర్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో వరద ప్రభావితమైన ప్రాంతాలు జీడిమెట్ల, అయోధ్యనగర్ , కుత్బుల్లాపూర్ డివిజన్ గణేశ్నగర్, రంగారెడ్డినగర్ డివిజన్ సౌభాగ్యనగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, జంట సర్కిళ్ల డీసీలు ఎ.నాగమణి, మల్లారెడ్డితో పాటు ఇంజినీరింగ్ విభాగం అధికారులు విస్తృతంగా పర్యటించి.. ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి .. సత్వరమే వరద నుంచి ప్రజలకు విముక్తి కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదముంపు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ప్రజలు అధికారయంత్రాంగం దృష్టికి తీసు కురావాలని సూచించారు. అలాగే.. మేడ్చల్ డీసీపీ శబరీష్తో పాటు ఏసీపీ, సీఐలు పర్యటించారు.
కాలనీల్లోకి వరదనీరు..
దుండిగల్,సెప్టెంబర్ 5 : గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో దుండిగల్ మున్సిపాలిటీ పాటు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలుప్రాంతాలు తాటాకాల ను తలపించాయి. మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, 1వ డివిజన్ బాచుపల్లిలోని ప్రణీత్ అంటీలియా కాలనీ ప్రహారీ ప్రమాదకరంగా మారింది. విషయం తెలుసుకున్న ప్రభు త్వ విప్,ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మీ, కమిషనర్ రామకృష్ణారావుతో పాటు వివిధ విభాగాల అధికారులు సం ఘటనా స్థలాన్ని సందర్శించి.. గోడను జేసీబీలతో కూల్చివేయించారు. అదే విధంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బౌరంపేట్లోని ల్యాం డ్మార్క్-2ను వరదనీరు ముంచెత్తడంతో కమిషనర్ సత్యనారాయణరావు, గండిమైసమ్మ దుండిగల్ తాసీల్దార్ సుచరిత, కౌన్సిలర్లు శంభీపూర్కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి అధికారులు, సిబ్బందితో కలిసి కాలనీలో పర్యటించారు. అదే సమయంలో కాలనీలో నిలిచిన వరదనీటిని కం దకం తవ్వి అక్కడ నిల్వ ఉండకుండా బయటకు పంపించారు.
వరదనీటితో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, డీ.పోచంపల్లిలోని సాయిపూజకాలనీ, శ్రీనివాస్నగర్ కాలనీ వీధుల్లో వరద నీరు పోటెత్తింది. ఫలితంగా ఆయాకాలనీలు జలమయమయ్యాయి. ఇక బాహదూర్పల్లిలోని అయోద్యవిల్లాస్ చుట్టూ వరదనీరు చేరడంతో స్థానికు లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికం గా ఉన్న బొబ్బాఖాన్ చెరువు కట్టకాలువను కొం దరు అక్రమార్కులు పూడ్చి అడ్డంగా నిర్మాణాలు చేపట్టడంతోనే ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు వాపోయారు. అదే విధంగా బహదూర్పల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీని వరదనీరు ముంచెత్తింది. మరో వైపు గాజులనామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని బాలాజీ ఎన్క్లేవ్, ఓక్షిత్ ఎన్క్లేవ్లలో వరదనీరు పోటెత్తడంతో ప్రజలు ఇండ్లల్లోనుండి బయటకు వచ్చేందుకు భయపడ్డారు.కాలనీ నిర్మాణ సమయంలో బిల్డర్ అక్రమాలకు పాల్పడి నాలాను పూడ్చివేయడంతోనే వర్షం పడిన ప్రతిసారి తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు.