మన్సూరాబాద్, మార్చి 19 : భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అసభ్యకరంగా, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్నతోపాటు సంస్థ క్యూ న్యూస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం భారత జాగృతి రంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారత జాగృతి రంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ.. ప్రతినిత్యం తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ చానెల్లో ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేయడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్నపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్గౌడ్, భగత్యాదవ్, సునిల్జోషి, అనిల్, శివ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల, మార్చి 19 : గత కొన్ని రోజుల నుంచి తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తన ఛానల్, పేపర్లో సమాజం తలదించుకునే మాటలతో వక్రీకరించి మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్న తీన్మార్ మల్లన్నపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భారత జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఇందిరారెడ్డి, సంధ్య, లక్ష్మి, అరుణా, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్, మార్చి 19 : భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిత్యం క్యూన్యూస్లో అసత్య ఆరోపణలతోపాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సదరు యూట్యూబ్ చానెల్ యజమాని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా భారత జాగృతి యువత కన్వీనర్ పడాల మనోజ డిమాండ్ చేశారు. మనోజ ఆధ్వర్యంలో పలువురు జాగృతి నేతలు ఆదివారం దుండిగల్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భారత జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.