మేడ్చల్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. దరఖాస్తులను ఈ నెల 17 వరకు ఆన్లైన్లో నమోదు చేయాలని, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలో ప్రతి రోజూ డేటా ఎంట్రీలు చేసే విధంగా చూడాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించారు.