జీడిమెట్ల, మార్చి 17: బైక్ అదుపుతప్పి.. చెట్టును ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్ రెడ్డి కథనం ప్రకారం.. చింతల్ భగత్సింగ్నగర్కు చెందిన ముప్పిడి గణేశ్ (28) శనివారం అర్ధరాత్రి అతడి స్నేహితుడు సాయితేజతో కలిసి యమహా వాహనంపై చింతల్ నుంచి షాపూర్నగర్ వైపు వెళ్తున్నారు.
వాహనం హెచ్ఎంటీ దర్గా వద్ద అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన గణేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. సాయి తేజకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు గణేశ్ తండ్రి నరసింహా ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.