బంజారాహిల్స్,జనవరి 23: మానసిక సమస్యలతో(Depression) ఇబ్బందులు పడుతున్న మహిళ ఆత్మహత్య(Commits suicide)కు పాల్పడిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రాంతానికి చెంది న షేక్ సైదులు, షేక్ బాదెమ్బీ(39) బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. పద్మాలయ అంబేద్కర్ బస్తీలో గది అద్దెకు తీసుకుని నివాసం ఉంపటన్నారు.
బాదెమ్ బీ ఓ డెంటల్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుండగా ఆమె భర్త షేక్ సైదులు హౌజ్ కీపింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా డిఫ్రెషన్తో బాధపడుతున్న బాదెంబీ సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.